ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జరుగుతున్న మహాకుంభమేళాకు ప్రచారం కల్పించేలా ఓ శకటం రూపొందించింది. ఏటి కొప్పాక లక్క బొమ్మలకు శతాబ్దల చరిత్ర ఉంది. అంకుడు కర్రను ఉపయోగించి చేతితో బొమ్మలు తయారుచేయడం ఇక్కడి ప్రత్యేకత. వాటికి సహజ సిద్ధమైన రంగులు అద్ది లక్క పెట్టి ఈ బొమ్మలను తీర్చిదిద్దుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసు గెలుచుకున్న ఈ బొమ్మల గురించి ఆయన మన్కీబాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2017లో ఈ బొమ్మలకు జిఐ విశిష్ట గుర్తింపు కూడా దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఈ బొమ్మలకు ప్రత్యేకత ఉంది. పర్యావరణహితంగా ఉండడంతోపాటు చిన్నపిల్లలు ఆడుకున్నా ఎటువంటి హాని చేయని విధంగా ఉంటాయి.
