
సోషల్ మీడియా పుణ్యమా అని పాపులర్ అయిన వారిలో గీతూ రాయల్ ఒకరు. ఈ చిన్నది సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. ఆతర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో తో మరింత గుర్తింపు తెచ్చుకుంది గీతూ రాయల్ . బిగ్ బాస్ సీజన్ 6 లో అడుగుపెట్టిన గీతూ తనదైన ఆటతీరుతో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అయితే తన ఓవరాక్షన్ తో ఊహించని విధంగా హౌజ్ నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ లకు రివ్యూలు చెప్పడంతో పాటు ఏడో సీజన్ బిగ్ బాస్ బజ్కు హోస్ట్ గా వ్యవహరించింది. ఇదిలా ఉంటే ఎప్పుడూ హుషారుగా, ఫుల్ జోష్ లో ఉండే గీతూ రాయల్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదానికి దారి తీశాయి.
గతంలో పలు వివాదాల్లో ఇరుక్కున్న గీతూ రాయల్ తాజాగా దివంగత నటి, మహానటి సావిత్రి గురించి వివాదాస్పద కామెంట్స్ చేసింది. నిత్యం సోషల్ మీడియాలో ఎదో ఒక వీడియో వదులుతూనే ఉంది గీతూ. ఇన్స్టాగ్రామ్లో హితబోధ వీడియోలు ఎక్కువ చేసే ఈమె.. తాజాగా చేసిన వివాదాస్పద కామెంట్స్ జనాలకు చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియోలో మాట్లాడుతూ.. సావిత్రి గురించి, ఆమె పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడింది.
“ఆల్రెడీ ప్రేమలో ఉన్నవాళ్ల జోలికి కానీ.. పెళ్లైన వాళ్ల జోలికికానీ.. అస్సలు పోవద్దు. మహానటి సినిమా చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది. సావిత్రమ్మ చాలా గొప్పది. కానీ పెళ్లైంది.. పిల్లలున్నారని తెలిసి కూడా.. జెమిని గణేశన్ని పెళ్లి చేసుకోవడం ఆమె జీవితంలో చేసిన పెద్ద తప్పు. ఆవిడ మాత్రం ఆయన్ని వేరే అమ్మాయితో చూస్తే తట్టుకోలేదూ.. కానీ ఆవిడ మాత్రం వేరే ఆమె భర్తని పెళ్లి చేసుకోవచ్చు. కర్మ అనేది బూమరాంగ్ లాగా.. ఆమె ఏదైతే చేసిందో తిరిగి ఆమెకి అదే తిరిగి వచ్చింది. మీ లైఫ్లో కూడా అదే జరుగుతుంది. ఒకరు మీకోసం వేరే వాళ్లని వదిలేసి వస్తున్నారంటే.. రేపటి రోజున వేరే వాళ్ల కోసం మిమ్మల్ని కూడా వదిలేస్తారు జాగ్రత్తగా ఉండండి” అంటూ హితబోధ చేసింది. దాంతో కొంతమంది నెటిజన్స్ ఆమె పై మండిపడుతున్నారు. “ఒకరి లైఫ్ గురించి జడ్జ్ చేయటానికి నువ్వెవరు.? ఆమె లైఫ్ ఆమె ఇష్టం” అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..