పైరసీ అనే భూతం సాంకేతికతతో పాటు మరింత విస్తరిస్తూ సినీ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఒకప్పుడు థియేటర్లలో కెమెరాలతో సినిమాలు రికార్డు చేసే దశ నుండి, ఇప్పుడు ఏకంగా డిజిటల్ మీడియా హౌస్ సర్వర్లను హ్యాక్ చేసి సినిమా ప్రింట్లను దొంగిలిస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠాను ఇటీవల పట్టుకున్నారు. ఈ ముఠా క్రిప్టో కరెన్సీ ద్వారా ఏజెంట్లకు కమిషన్లు చెల్లిస్తూ పైరసీ కంటెంట్ను వెబ్సైట్లలో అమ్మేస్తోంది. పూణేకు చెందిన 22 ఏళ్ల అస్మిత్ అనే యువకుడు యూఎఫ్ఓ, క్యూ వంటి డిజిటల్ మీడియా సర్వర్లను హ్యాక్ చేసి 120కి పైగా హెచ్డి చిత్రాలను దొంగిలించి ఒక లక్ష యూఎస్ డాలర్ల వరకు సంపాదించాడు. అతని వద్ద 22 కెమెరాలతో కూడిన నిఘా వ్యవస్థ కూడా ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hyderabadలో ప్రపంచ ముద్దుగుమ్మల సందడి అనాధ పిల్లల సేవలో సుందరాంగులు
ప్రసాద్ ల్యాబ్లో OG స్పెషల్ షో కుటుంబంతో కలిసి చూసిన పవన్
AP Rains: ఆంధ్రాకు భారీ వర్ష సూచన.. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
అమెరికా అధ్యక్ష భవనం ఇక బంగారుమయం
నా స్టాప్ వచ్చేసింది.. దిగిపోతున్నా
