
పిఠాపురం చిత్రాడలో జరుగనున్న జనసేన జయకేతనం సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం 4 గంటలకు సభ ప్రారంభంకానుంది. అదే సమయానికి జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభాప్రాంగణానికి చేరుకోనున్నారు. 250 మంది కూర్చునేలా సభా వేదిక, ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సభా ప్రాంగణం దగ్గర ఆల్రెడీ హడావిడి మొదలైపోయింది. పిఠాపురం చిత్రాడకు జనసేన శ్రేణులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సభకు వస్తున్న వాళ్లందరికీ భోజన సదుపాయాలు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు. అయితే ఎండతాపంతో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు మండుటెండలోనే విధులు నిర్వహిస్తున్నారు పోలీసులు. సభ వద్ద ఏకంగా 1,700 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షణ 250 మంది కూర్చునేలా సభా వేదిక, ప్రత్యేక గ్యాలరీలు సభా ప్రాంగణంలో 15 ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు.