
వేప ఒక ఔషధ మూలిక. ఆయుర్వేదంలో ఉపయోగించే ప్రసిద్ధ పదార్థాలలో వేప కూడా ఒకటి. ఆయుర్వేదంలో వేప చెట్టులోని ఆకులు, పండ్లు, నూనె, వేర్లు, బెరడు, వేప రసం వంటి ప్రతి భాగాన్ని ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. అయితే, వేప ఆకుల నీటితో కలిగే లాభాలు చాలా మందికి తెలియకపోవచ్చు..ఉదయం లేవగానే ఈ తాజా వేప రసాన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వేప నీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాము.
ఉదయం ఖాళీ కడుపుతో వేప ఆకుల నీటిని తీసుకోవటం వల్ల వైరల్, బ్యాక్టీరియా వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. శరీరం రోగనిరోధక శక్తిని బలపరుస్తుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేత ఆకుల వేప రసంలో అనేక ఔషధ గుణాలు నిండివున్నాయని చెబుతున్నారు. ఇవి క్యాన్సర్ కణాలను నాశనం చేయగలవని అధ్యయనంలో తేలింది. అంతేకాదు.. వేప గింజలలో ఒక క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఇది జుట్టు, చర్మానికి హాని కలిగించే పరాన్నజీవులకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
వేప ఆకు పదార్దాలు లేదా రసం గాయాలను నయం చేయడానికి దోహదపడతాయి. వేప పుల్లలతో దంతాలను తోముకుంటుంటే అది నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందుకోసం ఒక 10 తాజా లేత వేప ఆకులను తీసుకుని శుభ్రం చేసుకోవాలి.. వాటిని కావాల్సిన నీటిలో వేసుకుని 5 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత వాటిని వడగట్టుకుంటే వేప నీరు సిద్ధమవుతుంది.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..