
జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటనలో దోషిగా తేలిన సంజయ్రాయ్ డీఎన్ఏ 100 శాతం మృతురాలి శరీరంపై కనుగొన్నారు. అదేవిధంగా అతికొద్ది స్థాయిలో ఓ మహిళ డీఎన్ఏ సైతం బయటపడింది. అయితే, అది పొరపాటున ఈ డీఎన్ఏతో కలిసిందా లేక సదరు మహిళ కూడా నేరంలో భాగమైందా అనే విషయం తేలాల్సి ఉంది. విచారణలో భాగంగా జూనియర్ వైద్యురాలి శవపరీక్ష వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి…‘‘పోస్టుమార్టం కోసం ఉపయోగించిన వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో స్టెరిలైజ్ చేయలేదని ఈ వీడియోను చూస్తే అర్థమవుతోంది. తగిన సదుపాయాలు లేనికారణంగా వైద్య సిబ్బంది తగిన ప్రొటోకాల్ పాటించలేదని తెలుస్తోంది. కానీ తప్పనిసరి పరిస్థితిలో వారు ఈ విధుల్ని నిర్వర్తించడం మినహా మరో మార్గం లేదు’’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఈ నేరంలో మరికొందరి ప్రమేయం ఉందని జూనియర్ వైద్యురాలి తండ్రి గతంలో ఆరోపణలు చేశారు. తమ కూతురి గొంతుపై గాయాలున్నా స్వాబ్ సేకరించలేదని.. కేసు ఛేదించడానికి సీబీఐ ఎక్కువగా ప్రయత్నించడం లేదన్నారు. ఈ ఘటనలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లుగా డీఎన్ఏ రిపోర్టులో వెల్లడైందని అధికారులు తనకు తెలిపినట్లు ఆయన వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదంలో ఇకపై కొత్త ఐటమ్
Trump – Putin: పుతిన్కు మొదటి రోజే షాకిచ్చిన ట్రంప్
కశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పులు.. ఏపీ జవాన్ మృ*తి
TOP 9 ET News: రూ.60 కోట్లు పెడితే.. ఇప్పటి వరకు రూ.175 కోట్ల రాబడి
అమెరికాలో పెట్టేబేడా సర్దుకుంటున్న.. అక్రమంగా ఉంటున్న ప్రవాసులు!