ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా మోసమే జరుగుతోంది. నిత్యావసర వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల వరకు అన్నింటా మోసాలే జరుగుతున్నాయ్. సరిగ్గా అలాంటి ఘటన ఒకటి వరంగల్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా పర్వతగిరిలో దొంగ నోట్లు కలకలం రేపాయి. అక్కడి దుర్గశ్రీ వైన్స్లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగ నోట్లతో మద్యం కొనుగోలు చేశారు. ఈ డబ్బును బ్యాంక్లో జమ చేయడానికి వైన్స్ వాళ్లు వెళ్లగా.. ఒక రూ.500, రూ.100 దొంగ నోట్లను బ్యాంక్ అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, మార్కెట్లో దొంగనోట్ల చలామణి అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
