
హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ గ్రూప్ 3 సర్వీసు పోస్టుల ఫలితాలు శుక్రవారం (మార్చి 14) విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్ర వెంకటేశం ఈ రోజు ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలు రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్సైట్లో తమ వివరాలు నమోదుచేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మొత్తం 1365 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 1401 పరీక్ష కేంద్రాల్లో గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో రాత పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఫలితాల 2025 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రాష్ట్ర వ్యాప్తంగా 5,36,400 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,69,483 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. అంటే సగం మంది (50.24శాతం మంది) మాత్రమే గ్రూప్ 3 పరీక్షలకు హాజరయ్యారన్నమాట. మొత్తం 3 పేపర్లకు ఈ పరీక్షలు జరిగాయి.
ఇవి కూడా చదవండి
కాగా ఇప్పటికే షెడ్యూలు ప్రకారం మార్చి 10, 11 తేదీల్లో గ్రూప్-1, గ్రూప్-2 రాతపరీక్షల మార్కులను వెల్లడించిన కమిషన్.. మార్చి 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకు జాబితాను కూడా వెల్లడించింది. ఆయా పోస్టులకు సంబంధించిన మార్కులతో కూడిన జనరల్ ర్యాంకింగ్ జాబితాలో అభ్యర్ధులు తమ మార్కులను చెక్ చేసుకోవచ్చు. 563 గ్రూప్ 1 సర్వీసు పోస్టులకు, 783 గ్రూప్ 2 సర్వీసు పోస్టులకు నియామక ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఇవి రెండూ పూర్తైన తర్వాత గ్రూప్ 3 పోస్టులకు తుది జాబితా వెల్లడిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.