

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మానగర్ రహదారి సమీపాన ఉన్న బంగారం దుకాణంలో చోరీ జరిగింది. ఆ షాప్ నిర్వాహకులు ఎప్పటిలాగే ముందు రోజు రాత్రి దుకాణం మూసివేసి.. ఉదయం దుకాణం తీశారు. షాప్ తలుపులు తెరవగానే.. కనిపించింది చూసి దెబ్బకు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చోరీ ఎంతమేరకు జరిగిందన్న దానిపై క్లారిటీ రాలేదు. కాగా, ఈ విషయం తెలుసుకుని వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు పోలీసులు. చోరీకి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చూడండి