ప్రస్తుతం న్యూజిలాండ్తో వన్డే, టీ20 సిరీస్లు ఆడుతోంది టీమిండియా. అయితే ఈ ఏడాది ముగిసేలోపు జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. వయస్సు, ఫామ్, ఫిట్నెస్ కారణాల దృష్ట్యా ముగ్గురు కీలక ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.
