
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం మైన శ్రీశైలం మల్లన్న ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 3 కోట్ల 61 లక్షల 42 వేల 016 రూపాయల నగదు రాబడిగా లభించిందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 28 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈహుండి లెక్కింపులో నగదుతో పాటు 105 గ్రాముల 400 మిల్లీ గ్రాముల బంగారం అలానే వెండి 4 కేజీల 860 గ్రాములు లభించింది.
నగదు బంగారుతో పాటు యుఎస్ఏ డాలర్లు 644, సౌదీ అరేబియా రియాల్స్ 50, యుఏఈ దిర్హమ్స్115, యూకే పౌండ్స్ 670, సింగపూర్ డాలర్లు 54, కెనడా డాలర్లు 25, ఒమన్ బైసా 100, మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ లెక్కింపులో లభించాయని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో శ్రీనివాసరావు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..