
గతేడాది భారీ విజయాన్ని అందుకుంది శ్రద్ధా కపూర్. 2024లో ఆమె నటించిన స్త్రీ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ వసూల్లు రాబట్టింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అందం, అభినయంతో ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంది. గతంలో శ్రద్ధా కపూర్ ఓ లగ్జరీ కారు కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓ లగ్జరీ అపార్ట్మెంట్ని కొనుగోలు చేసిందనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఇంటి కోసం ఆమె చాలా డబ్బు ఖర్చు చేసిందని అంటున్నారు. శ్రద్ధా కపూర్ తన తండ్రి శక్తి కపూర్తో కలిసి ఈ కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు కొనుగోలు చేసిన ముంబైలో ఉన్నట్లు సమాచారం. ఈ ఇంటి కొనుగోలు ప్రక్రియ 13 జనవరి 2025 పూర్తైంది. ఇక ఇప్పుడు తన ఫ్యామిలీతో కలిసి శ్రద్ధా కపూర్ ఈ కొత్త ఇంటికి మారనున్నట్లు తెలుస్తోంది.
నివేదిక ప్రకారం ముంబైలోని జుహులో అత్యంత ఖరీదైన పిరమల్ మహాలక్ష్మి సౌత్ టవర్లో శ్రద్ధా కొత్త అపార్ట్మెంట్ ఉంది. ఈ కాంప్లెక్స్ రేస్ కోర్స్, అరేబియా సముద్రం అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది. లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలుదారులకు ఈ భవనం మొదటి ఎంపిక. పిరమల్ మహాలక్ష్మి సౌత్ టవర్ బిల్డింగ్లో 2BHK, 3BHK ఫ్లాట్లు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీ జైప్కిడ్ యాక్సెస్ చేసిన పత్రాల ప్రకారం.. కొత్త ఇల్లు 1042.73 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో రెండు పెద్ద బాల్కనీలతో విస్తరించి ఉంది. ఈ అపార్ట్మెంట్ చదరపు అడుగు ధర రూ. 59,875. ఇందుకోసం శ్రద్ధా కపూర్ రూ.6.24 కోట్లు చెల్లించింది.
గతంలో 3,928.86 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న అపార్ట్మెంట్ను ఒక సంవత్సరం లీజుకు తీసుకున్నారు. ఇందుకోసం శ్రద్ధా అడ్వాన్స్గా రూ.72 లక్షలు చెల్లించింది. ఈ నటి ఫ్లాట్తో పాటు నాలుగు కార్ పార్కింగ్ ప్రాంతం కూడా ఉందట. ఈ ఇంటికి రూ.36 వేలు స్టాంప్ డ్యూటీ, రూ.1000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిందట.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..