
10 డిసెంబర్ 1994న కర్ణాటకలోని బెంగళూరులో కన్నడ మాట్లాడే కుటుంబంలో జన్మించింది రుక్మిణి వసంత్. ఆమె తండ్రి, కల్నల్ వసంత్ వేణుగోపాల్, కర్నాటక నుండి భారతదేశం యొక్క అత్యున్నత శాంతికాల సైనిక అలంకరణ అయిన అశోక చక్రాన్ని పొందిన మొదటి వ్యక్తి. ఆమె తల్లి సుభాషిణి వసంత్ కర్ణాటకలో యుద్ధ వితంతువులకు మద్దతుగా ఒక ఫౌండేషన్ను స్థాపించిన నిష్ణాతుడైన భరతనాట్య నృత్యకారిణి.
ఆర్మీ స్కూల్, ఎయిర్ ఫోర్స్ స్కూల్ మరియు సెంటర్ ఫర్ లెర్నింగ్లో చదువుకుంది. ఆమె లండన్లోని బ్లూమ్స్బరీలోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ నుండి నటన డిగ్రీ పట్టా పొందింది ఈ వయ్యారి భామ.
ప్రారంభంలో థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత నటి కావాలన్న ఆసక్తితో సినిమాల్లోకి వచ్చింది. 2019 బీర్బల్ త్రైలోజి జి కేస్ 1: ఫైండింగ్ వజ్రముని అనే సినిమాతో చలనచిత్ర అరంగేట్రం చేసింది. అదే ఏడాది ఆప్ స్టైర్స్ సినిమాలో కనిపించింది.
2023లో సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ, బాణదరియల్లి, సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ బి అనే మూడు కన్నడ చిత్రాల్లో కథానాయకిగా ఆకట్టుకుంది. సప్త సాగరదాచే ఎల్లో సైడ్ ఎ & సైడ్ బి తెలుగులో సప్తసాగరాలు దాటి సైడ్ ఎ & సైడ్ బిగా విడుదలయ్యాయి.
2024లో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తర్వాత బఘీరా, భైరతి రణగల్ అనే రెండు కన్నడ చిత్రాల్లో కథానాయికగా ఆకట్టుకుంది. వీటితో పాటు ACE, SK23 అనే మరో రెండు తమిళ భాష చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో ACE చిత్రీకరణ పూర్తయింది. ఇది త్వరలో విడుదల కానుంది.