
మీ దగ్గర ఇంకా 2వేల రూపాయల నోట్లున్నాయా? మార్కెట్లో రూపాయికి కూడా చెల్లుబాటు కాని ఆ పెద్ద నోట్లు పర్సుల్లో పెట్టుకోడానికి పిచ్చోళ్లమనుకుంటున్నారా అంటారా. ఉంటారు.. అలాంటివారు అక్కడక్కడా ఉంటారు. ఇంకా ఉన్నారు. ఎప్పుడో రెండేళ్లక్రితమే పెద్దనోటు రద్దయిపోయినా.. ఇంకా నోట్లన్నీ బ్యాంకులకు తిరిగి రాలేదంటే అవి ఎక్కడున్నట్లు? కొందరు వాటిని ఎందుకింకా దాచుకున్నట్లు?
బ్యాంకులకు 98.18శాతం రెండువేల నోట్లు తిరిగోచ్చినట్టు తెలుస్తోంది. 2025 ఫిబ్రవరి 28దాకా 98.18శాతం నోట్లు రిటర్న్ వచ్చాయట. అటు ఇంకా ప్రజల చేతుల్లోనే 6వేల 471 కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. 2023 మే 19న 2వేల రూపాయల నోటు ఉపసంహరణకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. ఆర్బీఐ ప్రకటన నాటికి 3లక్షల 56వేల 2వేల రూపాయల నోట్ల చలామణిలో ఉన్నాయి. 2023 సెప్టెంబరు 30దాకా మార్చుకునే అవకాశమిచ్చిన ఆర్బీఐ.. ఆ తర్వాత మరో వారం గడువు పొడిగించింది. RBI ప్రాంతీయ కార్యాలయాల్లో 2వేల నోట్ల మార్పిడి, డిపాజిట్ చేసే వెసులుబాటు కల్పించింది. హైదరాబాద్ సహా దేశంలో 18చోట్ల ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. అటు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా పంపే అవకాశం ఇచ్చింది. ఇంత చేసినా.. ఇంకా చాలామంది దగ్గర రూ. 2 వేల రూపాయల నోట్లు ఉన్నాయి.
అవగాహన లేక అనుకోడానికి లేదు. అఫీషియల్గా చూపించేందుకు ఇష్టపడనివారు కొందరు ఉండుండొచ్చు. అందుకే ఇంకా కొంతమేర 2వేల నోట్లు బ్యాంకులకు తిరిగిరాలేదని భావిస్తున్నారు. ఇప్పటికీ ఆర్ఐబీ ప్రాంతీయ కార్యాలయాలలో నోట్ల మార్పిడి, డిపాజిట్కి అవకాశముందంటోంది రిజర్వ్బ్యాంక్. రీజనల్ ఆఫీసులకు చేరుకోలేనివారు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఆయా కార్యాలయాలకు పంపొచ్చు. దేశంలో హైదరాబాద్ సహా 18చోట్ల ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. రద్దయినా 2వేల నోట్లుచిత్తు కాగితాలేం కావు. అధికారికంగా మార్చుకునే ఆఫర్ని ఓపెన్గా ఉంచింది ఆర్బీఐ.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..