
12 జనవరి 1988న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ లో జన్మించింది ప్రగ్య జైస్వాల్. ప్రంజూల్ జైస్వాల్ అనే సోదరి కూడా ఈమెకు ఉంది. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది.
సింబయాసిస్ యూనివర్శిటీలో చదువుతున్న సమయంలో ఆమె వివిధ అందాల పోటీల్లో పాల్గొని విజయవంతమైన మోడల్గా మారింది. 2014లో కళ మరియు సాంస్కృతిక రంగంలో ఆమె సాధించిన విజయానికి సహజీవన సాంస్కృతిక పురస్కారాన్ని అందుకుంది. అందాల పోటీ ఫెమినా మిస్ ఇండియా 2008 ద్వారా మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ డ్యాన్సింగ్ క్వీన్ మరియు మిస్ ఫ్రెండ్ ఎర్త్ టైటిల్లను గెలుచుకుంది.
2015లో మిర్చి లాంటి కుర్రాడు చిత్రంతో తెలుగు డెబ్యూ ఇచ్చిన ఈ బ్యూటీ… అదే ఏడాది వచ్చిన కంచె సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కంచె చిత్రానికి 63వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూట్, 5వ SIIMA ఉత్తమ మహిళా అరంగేట్రం (తెలుగు), సినీమా అవార్డ్స్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ, 18వ ఉగాది పురస్కారాలు ఉత్తమ మహిళా అరంగేట్రం, జీ తెలుగు అప్సర అవార్డులు, TSR – TV9 జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఉత్తమ తొలి నటి అవార్డులు ఉందుకుంది.
తర్వాత తెలుగు ఓం నమో వెంకటేశాయ అనే ఆధ్యాత్మిక చిత్రంలో మెప్పించింది. తర్వాత జయ జానకి నాయక, అఖండ, ఇటీవల దాకు మహారాజ్ వంటి బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో నటించింది.
మధ్య మధ్యలో గుంటూరోడు, నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర, సన్ అఫ్ ఇండియా చిత్రాల్లో నటించిన అవి ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం అఖండ 2 మూవీలో కథానాయకిగా నటిస్తుంది. మరికొన్ని సినిమాలు కూడా సైన్ చేసింది.