
మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఆదివాసీ మహిళలు తయారు చేసే ఇప్పపువ్వు లడ్డుల గురించి ప్రస్తావించారు మోదీ. ఇప్పపువ్వు లడ్డూల ద్వారా స్వయం ఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ ఆదివాసీ మహిళల స్వయం కృషిని మన్ కీ బాత్తో అభినందించారు మోదీ. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తెలంగాణ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నేతలు వీక్షించారు. కార్యాలయంలో స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రధాని చెప్పిన సందేశాలను విన్నారు. కాగా, మొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అప్పటినుండి ప్రధాని మోదీ మనసులోని మాటలను మన్ కి బాత్ కార్యక్రమం ద్వారా ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేస్తున్నారు.