

ప్రధాని మోదీ ఇవాళ నాగ్పూర్లోని RSS కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి స్మృతి మందిర్లో RSS వ్యవస్థాపకులు హెడ్గేవార్, గోల్వాల్కర్కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజిటర్స్ బుక్లో ప్రధాని తన సందేశం రాశారు. స్మృతి మందిర్కు రావడంతో తన హృదయం ఉప్పొంగిందన్నారు. లక్షలాది స్వయంసేవకులకు ఇది శక్తి కేంద్రమన్నారు. దేశసేవ కోసం ముందడుగు వేయడానికి స్మృతి మందిర్- ప్రేరణ ఇస్తుందని మోదీ అన్నారు. మన కృషితో భారతమాత గౌరవాన్ని పెంపొందిద్దామని ప్రధాని మోదీ తన సందేశంలో పిలుపునిచ్చారు.