జనన మరణాల నమోదు చట్టం, 2023 ప్రకారం అక్టోబర్ 1, 2023 తర్వాత జన్మించిన పౌరులందరూ ఇప్పుడు పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు జనన తేదీకి రుజువుగా వారి జనన ధృవీకరణ పత్రాన్ని కచ్చితంగా జతచేయాల్సి ఉంటుంది. అయితే ఈ కటాఫ్ తేదీకి ముందు జన్మించిన వారు ఏయే పత్రాలు జనన ధ్రువీకరణ పత్రంగా సమర్పించాలో? కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి అనుమానాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం ఇటీవల ఓ గెజిట్ను విడుదల చేసింది. పాస్పోర్ట్ సవరణ నియమాలు-2025 ప్రకారం జనన రుజువుగా ప్రత్యామ్నాయ పత్రాలను సమర్పించవచ్చు.
ఆ పత్రాలు ఇవే
- పాఠశాలలు జారీ చేసే టీసీతో పాటు మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు.
- పాన్ కార్డు
- ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సర్వీస్ రికార్డ్ లేదా పే పెన్షన్ ఆర్డర్
- డ్రైవింగ్ లైసెన్స్
- ఓటు గుర్తింపు కార్డు
- ఎల్ఐసీ లేదా ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన పాలసీ బాండ్.
గతంలో కూడా, జనన ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించడానికి కటాఫ్ తేదీని నిర్ణయించారు . దాన్ని జనవరి 26, 1989గా పేర్కొన్నారు. అయితే 2016లో ఈ నిబంధనను తొలగించారు. దరఖాస్తుదారులందరూ తమ పాస్పోర్ట్ దరఖాస్తుతో పైన జాబితా చేయబడిన పత్రాలలో దేనినైనా జనన రుజువుగా జతచేయడానికి వీలుగా పాస్పోర్ట్ నియమాలు సవరించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
