
ఈ మధ్యన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ ఆడియెన్స్ ను బాగా అలరిస్తున్నాయి. అలాగే ఇంగ్లిష్ ఇతర భాషల్లోని క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను కూడా ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా చూస్తున్నారు. అయితే ఇతర భాషలతో పోల్చితే తెలుగులో ఈ జానర్ సినిమాలు కొంచెం తక్కువే. అయితే కొన్ని నెలల క్రితం తెలుగులో వచ్చిన ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆడవాళ్ల రక్తం తాగే మనిషి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం దిమ్మతిరిపోతుంది. అందుకే ఈ సినిమా ఏకంగా మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా కథ విషయానికి వస్తే.. హైదరాబాద్ లో కొందరు అమ్మాయిలు వరుసగా కిడ్నాప్కు గురవుతారు. దీని వెనక గల మిస్టరీని ఛేదించేందుకు స్పెషల్ ఆఫీసర్లుగా హీరో, హీరోయిన్లు రంగంలోకి దిగుతారు. అదే సమయంలో ఎప్పుడో అంతరించిపోయిందనుకున్న ఓ తెగకు చెందిన ఓ వ్యక్తి జనారణ్యంలోకి వచ్చాడని తెలుస్తుంది. అతనే ఆ అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారి రక్తం తాగుతుంటాడని తెలుస్తుంది. మరి ఆడవాళ్ల రక్తం తాగే మనిషి ఎవరు? దాని వెనక ఉన్న కథేంటి? పోలీసులు ఎలా అతనిని పట్టుకున్నారో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఇంతకీ ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఏదని అనుకుంటున్నారా? ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా నటించిన హిడింబ. అనిల్ కన్నెగంటి తెరకెక్కించిన ఈ సినిమాలో నందితా శ్వేతా హీరోయిన్ గా నటించింది. థియేటర్లలో ఓ మాదిరిగా ఆడిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం అదరగొట్టింది. ఆకట్టుకునే కథా కథనాలు, స్క్రీన్ ప్లే, ట్విస్టులు.. ఇలా అన్నీ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా హిడింబ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ ఎవ్వరూ ఊహించని విధంగా మైండ్ బ్లాక్ అయ్యేలా ఉందని కామెంట్స్ వినిపించాయి. మరి మీరు ఈ సినిమాను చూశారా? లేకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ ఓటీటీల్లో హిడింబను చూసి ఎంజాయ్ చేయండి.
ఇవి కూడా చదవండి
A thriller that messes with your mind & keeps you on the edge! 🔥
Watch #Hidimbha now on @PrimeVideoIN! 🍿#HidimbhaOnPrime ▶️ https://t.co/hdIic0zT6P@imashwinbabu @Nanditasweta @aneelkanneganti @vikasbadisa @AKentsOfficial #SVKCinemas #TeluguFilmNagar pic.twitter.com/RIq6ChPXEf— Telugu FilmNagar (@telugufilmnagar) March 15, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.