
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా దేవరతో హిట్ అందుకున్న తారక్.. ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అక్కడ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2లో నటిస్తున్నారు తారక్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాతోపాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అలాగే దేవర 2లోనూ నటిస్తున్నారు తారక్. ఇదిలా ఉంటే తాజాగా తారక్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ఆసక్తికర కామెంట్స్ చేశారు తారక్. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ-రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై, చిత్ర బృందాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కళ్యాణ్ రామ్, విజయశాంతి నటనపై ప్రశంసలు కురిపించారు తారక్. సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది ఒక తల్లి-కొడుకు ఎమోషనల్ బంధాన్ని ఆధారంగా చేసుకున్న కమర్షియల్ చిత్రమని, ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని అన్నారు తారక్. కళ్యాణ్ రామ్ తన సినిమాలతో ఎప్పుడూ కొత్తదనం తీసుకొస్తాడని, ఈ సినిమా కూడా అలాంటి ప్రయత్నమేనని పేర్కొన్నారు.
విజయశాంతి గురించి మాట్లాడుతూ.. ఆమె లేడీ సూపర్స్టార్గా తెలుగు సినిమాకు ఎంతో గొప్ప పేరు తెచ్చారని, ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుందని తెలిపారు. విజయశాంతి తెలుగుతనం ఉట్టిపడేలా కనిపిస్తారని అన్నారు. అలాగే ఈ రోజు విజయశాంతి మాట్లాడుతుంటే.. మా నాన్న గారు గుర్తొచ్చారు. ఈ రోజు.. నాన్న లేని లోటు విజయశాంతి భర్తీ చేశారని… వెల్లడించారు తారక్. సినిమా ఏప్రిల్ 18న విడుదలవుతుందని, అందరూ థియేటర్లో చూసి ఆదరించాలని కోరారు తారక్. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..