
నేహా శెట్టి.. ఈ పేరుతో కంటే రాధికా అనే కుర్రాళ్ళు టక్కున గుర్తుపట్టేస్తారు ఈ అమ్మడిని. డీజే టిల్లు సినిమాతో ఒక్కాసారిగా కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది నేహా శెట్టి. ఈ అమ్మడు మెహబూబా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
ఆకాష్ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. అదే సమాయంలో డీజే టిల్లు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలో మోడ్రన్ లుక్స్ తో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు క్రేజ్ మారిపోయింది. తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. తెలుగులోనే కాకుండా కన్నడ ఇండస్ట్రీలోనూ వరుస సినిమాల్లో నటిస్తుంది.
అయితే కొన్నాళ్లుగా టాలీవుడ్ లో సైలెంట్ అయింది నేహా శెట్టి. డీజే టిల్లు తర్వాత ఒకటిరెండు చిత్రాల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మత్రం ఒక్క సినిమా సైతం ప్రకటించలేదు. కేవలం కన్నడలోనే సినిమాలు చేస్తుంది.
కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటుంది. అలాగే ఏదోక క్రేజీ పిక్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా రిలాక్స్ మోడ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఆ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.