
MS Dhoni: ఐపీఎల్ 2025లో మహేంద్ర సింగ్ ధోని మరోసారి చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. చెన్నై రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో ధోనీ జట్టును నడిపించే బాధ్యతలను స్వీకరించాడు. ఏప్రిల్ 11న కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ధోని కెప్టెన్గా బరిలోకి దిగాడు. అయితే, ఈ మ్యాచ్లోనూ ధోని విజయాన్ని అందించలేకపోయాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ధోనిని విమర్శిస్తూ కనిపించాడు.
వీరేంద్ర సెహ్వాగ్ ఏమన్నాడంటే?
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పాత ప్రకటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అతను ధోనిని విమర్శించాడు. ఈ వీడియో 2019 నాటిది. ఐపీఎల్ 12వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధోని డగౌట్ నుంచి బయటకు వచ్చి మైదానంలోకి దూసుకొచ్చాడు. దీని కారణంగా ధోని చాలా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. ధోని మ్యాచ్ ఫీజులో సగం తగ్గించారు. ఈ విషయంలో ధోనిని 2 నుంచి 3 మ్యాచ్ల నుంచి నిషేధించాలని సెహ్వాగ్ సూచించాడు.
‘ భారత జట్టు కోసం ధోని అలా చేసి ఉంటే, నేను చాలా సంతోషంగా ఉండేవాడిని. భారత జట్టు కెప్టెన్గా ఉన్న రోజుల్లో అతను అంత కోపంగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు. చెన్నై గురించి చాలా భావోద్వేగానికి గురవుతున్నాడని నేను భావిస్తున్నాను. ఇద్దరు చెన్నై ఆటగాళ్ళు మైదానంలో ఉన్నప్పుడు సెహ్వాగ్ మైదానంలోకి రాకూడదని నేను భావిస్తున్నాను అంటూ వీడియోలో సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఆ ఇద్దరు ఆటగాళ్ళు కూడా ధోనిలాగే నో బాల్ గురించి కోపంగా ఉన్నారు. కాబట్టి ఆ విషయం వాళ్లకు వదిలేస్తేనే మంచిది’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి
ఈ వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతోంది?
ఆ సమయంలో వీరేంద్ర సెహ్వాగ్ చెప్పింది నిజమే. కానీ, కోట్లాది మంది అభిమానులు ధోనీని నిషేధం అనే మాటలు వినడానికి ఇష్టపడరు. వీరేంద్ర సెహ్వాగ్ లాంటి గొప్ప ఆటగాడి నుంచి ఈ మాటలు రావడం ధోని ఫ్యాన్స్కు మరింత బాధ కలిగింది. అందుకే అభిమానులు సెహ్వాగ్ పాత ప్రకటనను వైరల్ చేస్తూ.. ధోని 43 ఏళ్ల వయసులో కూడా కెప్టెన్గా ఉండటానికి సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..