
‘పరువం వానగా నేడు కురిసిందిలే’ అనే పాట వినగానే మన కళ్ల ముందు ఒక అందమైన రూపం మెదులుతుంది. తనే హీరోయిన్ మధు బాల. అందం అంతకు మించిన అభినయంతో 90వ దశకంలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిందీ ముద్దుగుమ్మ. మరీ ముఖ్యంగా మణి రత్నం రోజా సినిమాతో అప్పటి యూత్ కలల రాకుమారిగా మారిపోయింది. తెలుగుతో పాటు హిందీ , తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోసినిమాలు చేసి మెప్పించింది మధు బాల. తెలుగులో అల్లరి ప్రియుడు, ఆవేశం, గణష్, చిలక్కొట్టుడు, జెంటిల్మెన్ తదితర సినిమాల్లో యాక్ట్ చేసి ఇక్కడి ఆడియెన్స్ కు బాగా చేరువైంది. కాగా సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే మధు బాల వివాహం చేసుకుంది. బాలీవుడ్ నటీమణులు హేమా మాలిని, జుహీ చావ్లాలకు దగ్గరి బంధువు అయిన వ్యాపార వేత్త ఆనంద్ షాను 1999 ఫిబ్రవరి 19న మ్యారేజ్ చేసుకుందీ అందాల తార. ఈ దంపతులకు అమెయా, కెయా అనే ఇద్దరు అందమైన కుమార్తెలు ఉన్నారు.
పెళ్లి, పిల్లల తర్వాత సినిమాలకు క్రమంగా దూరమైంది మధు బాల. అయితే మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మరీ హీరోయిన్ రేంజులో వరుసగా సినిమాలు చేయకపోయినా సపోర్టింగ్ రోల్స్ తో ఆకట్టుకుంది. అంతకు మందు ఆ తర్వాత, సూర్య వర్సెస్ సూర్య, ప్రేమ దేశం, ఈగల్, శాకుంతలం తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది మధు బాల. ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్ప సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించనుందీ అందాల తార.
ఇవి కూడా చదవండి
తన ఇద్దరు కూతుళ్లతో రోజా హీరోయిన్ మధు బాల..
కాగా మధుబాలకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారి పేర్లు కియా షా, అమేయ షా. ఇద్దరూ తల్లి లాగానే చాలా అందంగా, అట్రాక్టివ్గా కనిపిస్తారు. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా ఇద్దరు కూతుర్లలో కియా షా త్వరలో సినిమాల్లోకి అడుగు పెట్టనుందని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే వర్క్ జరగనుందని సమాచారం. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన రావొచ్చని తెలుస్తోంది.
గ్లామరస్ లుక్ లో మధు బాల ఇద్దరు కుమార్తెలు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.