
మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన L2: ఎంబురాన్ చిత్రం మార్చి 27, 2025న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరోవైపు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి దాదాపు 24 సన్నివేశాలను తొలగించాలని నిర్ణయించింది చిత్రయూనిట్. ఈ క్రమంలో ఎల్ 2 ఎంపురాన్ మూవీ నిర్మాతలు టాప్ నటుడు సురేష్ గోపికి సంబంధించిన సన్నివేశాలను సైతం కట్ చేశారు. అంతకు ముందు సినిమా ప్రారంభంలో నటుడు-కేంద్ర మంత్రి కోసం ఒక ప్రత్యేక టైటిల్ కార్డ్ ఉండేది. ఇప్పుడు దానిని తొలగించారు. సురేష్ గోపికి థాంక్యూ కార్డ్ కాకుండా, ఈ చిత్రానికి అనేక మార్పులు చేశారు. అలాగే సినిమా రన్ టైమ్ నుండి 2 నిమిషాల 8 సెకన్లు తగ్గింది.
అలాగే సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ క్యాన్సల్ చేశారు మేకర్స్. ఈ మూవీలోని తీవ్రమైన సన్నివేశాల వ్యవధిని తిరిగి తగ్గించారు. ఎంపురాన్ సినిమాపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పలు సన్నివేశాలపై కొన్ని మితవాద సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సినిమా చిక్కుల్లో పడింది. ఈ విషయంపై ఇప్పటికే మోహన్ లాల్ క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత , చిత్ర నిర్మాత ఆంథోనీ పెరుంబవూర్ మీడియ ముందుకు వచ్చి విలేకరులతో మాట్లాడారు.
రాజకీయ సంస్థల ఒత్తిడి వల్ల ఈ సినిమాను తిరిగి సవరించలేదని చెప్పారు. ఈ సినిమా గతంలో వచ్చిన లూసీఫర్ మూవీకి సీక్వెల్. మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్, టోవినో థామస్, జెరోమ్ ఫ్లిన్, రిక్ యున్ కీలకపాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..
Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..
Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..
Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..