
Gujarat Titans vs Rajasthan Royals, IPL 2025: ఐపీఎల్ 23వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ను 58 పరుగుల తేడాతో ఓడించింది. రాజస్థాన్ జట్టు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. సమాధానంగా రాయల్స్ జట్టు 159 పరుగులకు ఆలౌట్ అయింది.
గుజరాత్కు చెందిన సాయి సుదర్శన్ 82 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. జోస్ బట్లర్, షారుఖ్ ఖాన్ తలొ 36 పరుగులు చేశారు. బౌలింగ్లో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీశాడు. సాయి కిషోర్, రషీద్ ఖాన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. రాజస్థాన్ బౌలర్లలో మహేష్ తీక్షణ, తుషార్ దేశ్ పాండే చెరో 2 వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ సంజు సామ్సన్ 41 పరుగులు చేశాడు.
రెండు జట్ల ప్లేయింగ్-11..
Match 23. Gujarat Titans Won by 58 Run(s) https://t.co/raxxjzY9g7 #GTvRR #TATAIPL #IPL2025
— IndianPremierLeague (@IPL) April 9, 2025
గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.
ఇంపాక్ట్ ప్లేయర్లు: వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, మహిపాల్ లోమ్రోర్, సింధు.
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, ఫజల్ హక్ ఫరూఖీ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే.
ఇంపాక్ట్ ప్లేయర్లు: శుభం దూబే.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..