

దేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయిని తాకిన విషయం తెలిసిందే.. రెండు రోజులుగా పసిడి ధరలు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరడంతో, బులియన్ మార్కెట్లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర లక్ష మార్కును దాటింది. పెళ్లిళ్ల సీజన్, అక్షయ తృతీయ వేళ పసిడి ధరలు ఈ స్థాయికి చేరడంతో వినియోగదారులు భయపడుతున్నారు.. ఈ తరుణంలో పసిడి ప్రియులకు శుభవార్త వచ్చింది.. బుధవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్క రోజులోనే దాదాపు రూ.3 వేల మేర బంగారం ధర తగ్గింది.. లైవ్ మార్కెట్లో రూ.99,000 అటూఇటూగా బంగారం ట్రేడవుతోంది..
ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయంటే హైదరాబాద్ 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,120కి చేరింది.. 22 క్యారెట్ల ధర రూ.90,150గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర హైదరాబాద్లో రూ.98వేల 710గా ఉంది.