
అశ్వత్ మారిముత్తు దర్శకత్వం లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘డ్రాగన్’. అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహార్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. థియేటర్లలో ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. ఫిబ్రవరి 21, 2025న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు యువత బ్రహ్మరథం పట్టింది. సాధారణ ప్రేక్షకులు సైతం ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సహా పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను చూసి చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. ఇక దళపతి విజయ్ ఇప్పటికే డ్రాగన్ చిత్ర బృందానికి ఫోన్ చేసి చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించాడు. ఇప్పుడు డ్రాగన్ చిత్ర బృందం దళపతి విజయ్ ని ప్రత్యేకంగా కలిసింది. దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోని కలవడం పట్ల ‘డ్రాగన్’ బృందం తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీని గురించి దర్శకుడు అశ్వత్ మారిముత్తు మాట్లాడుతూ, ‘నేను దళపతి విజయ్ని కలిశాను. నేను అతనితో సినిమాల్లో పనిచేయాలనుకున్నాను. కానీ నాకు వారితో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. కానీ నాకు వాళ్ళకి ఎదురుగా కూర్చునే అవకాశం వచ్చింది. విజయ్ సార్ తో మాట్లాడుతున్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ ప్రేమ వర్ణించలేనిది’ అని దర్శకుడు అశ్వత్ మారిముత్తు దళపతి విజయ్ను కలిసిన క్షణం గురించి అన్నారు.
ఇవి కూడా చదవండి
ఇక ‘డ్రాగన్’ హీరో ప్రదీప్ రంగనాథన్ దళపతి విజయ్ గురించి ఒక భావోద్వేగ పోస్ట్ను పంచుకున్నారు. ‘కలకురీంగా బ్రో.. దళపతి నుండి ఇది వింటే నాకు ఎలా అనిపిస్తుంది? నేను ఎలా ఉండిపోయానో మీరందరూ అర్థం చేసుకోగలరని నాకు తెలుసు. దళపతి విజయ్ సర్ మాట్లాడిన మాటలు, మాకిచ్చిన విలువైన సమయానికి ధన్యవాదాలు సార్” అని X వేదికగా ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. అని హీరో ఎమోషనల్ అయ్యాడు.
‘ Kalakureenga Bro ‘ – How will i feel hearing this from Thalapathy . I know you all can understand how i would have felt .
Thankyou for the words and time sir .Waiting for sachein re-release . pic.twitter.com/J7N3XsKOtU
— Pradeep Ranganathan (@pradeeponelife) March 24, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..