
భోజనం చివరిలో ఒక్క ముద్దకి అయినా పెరుగు వేసుకుని తినకపోతే.. తిన్న ఫీలింగ్ ఉండదని చాలా మంది అంటారు. భోజనం చివరిలో పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో పెరుగు చక్కగా హెల్ప్ చేస్తుంది. వేడి చేయకుండా చేస్తుంది.
పెద్దవారే కాకుండా చిన్న పిల్లలకు కూడా ప్రతి రోజూ ఒక కప్పు పెరుగు తినిపించాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదే అయినా మజ్జిగతో మరిన్ని లాభాలు ఉన్నాయి. పెరుగు కంటే మజ్జిగ తాగడమే హెల్త్కి మంచిది.
ప్రతిరోజూ ఒక గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల బాడీ కూల్ అవుతుంది. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. చర్మానికి, జుట్టుకి కూడా చాలా మంచిది. తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది.
మజ్జిగలో పోషకాలు ఎక్కువగా.. కొవ్వు పదార్థాలు తక్కువగానూ ఉంటాయి. పేగుల ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలు, విష పదార్థాలను బయటకు పంపుతుంది.
కడుపులో మంట, పుండ్లు, అసిడిటీ, గ్యాస్తో బాధ పడేవారు మజ్జిగ తాగడం వల్ల ఉపశమనంగా ఉంటుంది. శరీరానికి వేడి చేయకుండా కాపాడుతుంది. ఇతర డ్రింక్స్ కంటే మజ్జిగ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)