

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో 21 కేజీ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో దొంగిలించిన ఒక బైకును ఇచ్చి 21 కేజీ గంజాయిని నిందితులు తెచ్చుకున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం చెందిన మురుకుర్తి సూర్య ప్రకాష్, అతడి స్నేహితులు ఆవాల మణికంఠ, తోలుమ్ రాజు.. చికెన్ షాపులో పని చేస్తూ అక్రమంగా గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసుల ముందు కూడా ఒప్పుకున్నారు నిందితులు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి సుమారు లక్షా ఐదు వేల రూపాయల విలువ ఉంటుందని అంచనా. గంజాయి నేరస్థులకు కఠిన శిక్షలు ఉంటాయని.. గంజాయిని ఎవరు సప్లై చేస్తున్నారో త్వరలోనే కనిపెడతామని పోలీసుల వివరణ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి