
తెలుగు రాష్ట్రాల్లో వివస్త్రగా తిరుగుతూ సంచలనం రేపిన లేడీ అఘోరీ అన్నంత పనీ చేసింది. తాను వివస్త్రగా తిరుగుతున్న సమయంలో బట్టలు అందించి సహకరించిన యువతి వర్షిణిని వివాహం చేసుకుని మరో సంచలనానికి తెరతీసింది. మధ్యప్రదేశ్ లోని ఓ ఆలయంలో అఘోరీ, వర్షిణీ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఒకరికొకరు దండలు మార్చుకుని, తలంబ్రాలు పోసుకుని, ఏడడుగులు నడిచారు. స్థానిక భక్తులు ఉత్సహంగా భక్తి పాటలు పాడుతూ వారిని ఆశీర్వదించారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.
ఏపీలోని నందిగామలో వర్షిణికి అఘోరీ పరిచయం అయింది. బీటెక్ చదువుకున్న వర్షిణి అఘోరీకి ఆకర్షితురాలైంది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత అఘోరీ వర్షిణి ఇంట్లో కొన్నాళ్లు మకాం వేసింది. అక్కడ పూజలు కూడా చేసింది. అక్కడినుంచి వెళ్లిపోతూ వర్షిణిని కూడా వెంట తీసుకెళ్లింది అఘోరీ. తమ కుమార్తెకు లేనిపోని మాయమాటలు చెప్పి అఘోరీ తమ కుమార్తెను ఎత్తుకెళ్లిపోయాడని వర్షిణీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు వర్షిణి తల్లిదండ్రులు గుజరాత్లో ఉన్న తమ కుమార్తెను అఘోరీ దగ్గర నుంచి తిరిగి తీసుకొచ్చారు. కొన్నాళ్లు తల్లిదండ్రులతో కలిసి బాగానే ఉంది వర్షిణి. కానీ అఘోరీని మర్చిపోలేకపోయింది. మళ్లీ ఇంటినుంచి పారిపోయింది. ఇప్పుడు అఘోరీ-వర్షిణి పెళ్లి చేసుకున్నట్టు నెట్టింట వీడియో వైరల్ అవుతోంది.
ఆహోరిని పెళ్లి చేసుకున్న శ్రీ వర్షిణి పెళ్లితో ఒక్కటైన అఘోరీ, శ్రీవర్షిణి pic.twitter.com/QdM2ZV0KZx
— NageshT (@NageshT93116498) April 15, 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.