జులై 23న మధ్యప్రదేశ్ జబల్పూర్లో రద్దీగా ఉండే నాగరత్ చౌక్ వద్ద రెండు గుర్రాలు ఉన్నట్టుండి ఘర్షణకు దిగాయి. స్థానికులు వాటిని తరిమికొట్టడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే అవి.. అక్కడే ఉన్న ఓ షోరూమ్లోకి దూసుకెళ్లి, విధ్వంసం సృష్టించాయి. ఆ తరువాత వాటిలో ఒక గుర్రం మళ్లీ రోడ్డుపైకి వచ్చి.. రోడ్డుపై ప్రయాణీకులతో వెళ్తున్న ఒక ఇ-రిక్షాపైకి దూకింది. దీంతో ఆ రిక్షా డ్రైవర్, ఒక ప్రయాణీకుడు తీవ్రంగా గాయపడ్డారు. చుట్టుపక్కలవారు పరుగెత్తుకుంటూ వచ్చి గాయపడిన వారిని వాహనం నుంచి బయటకు తీసి అంబులెన్స్కు ఫోన్ చేశారు. అయితే, గుర్రం ఆటోలో చిక్కుకుపోయి దాదాపు 20 నిమిషాల పాటు అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత స్థానికులు దానిని అతికష్టం మీద బయటకు తీశారు. ఈ ప్రమాదంలో గుర్రం కూడా గాయపడినట్లు తెలుస్తోంది. కాగా, గత రెండు మూడు రోజులుగా ఆ కూడలిలో.. ఈ రెండు గుర్రాలు పరస్పరం దాడి చేసుకుంటున్నాయని, దీనిపై కార్పొరేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని స్థానిక షాపుల యాజమానులు వాపోయారు. స్థానికంగా కాసేపు గందరగోళానికి దారితీసిన ఆ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మరిన్ని వీడియోల కోసం :
కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా? వీడియో
వరుణ్ బర్త్ డే.. భార్య ఇచ్చిన గిఫ్ట్ చూసి ఒక్కసారిగా షాక్ వీడియో
ర్యాపిడో రైడ్లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన యువతి..! డ్రైవర్ చేసిన పనితో వీడియో
