ఇకపై వీటికి చెక్ పెట్టేందుకు ఏఐ రెడీ అయింది. సూదితో పొడిచి రక్తం తీయాల్సిన పని లేకుండానే రక్త పరీక్ష చేసేందుకు సరికొత్త పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా కేవలం ముఖాన్ని స్కాన చేస్తే చాలు. కీలకమైన ఆరోగ్య వివరాలు తెలుస్తాయి. ఇది ఎలా సాధ్యమంటే దీనికోసం ఏఐ ఆధారిత డయాగ్నొస్టిక్ సాధనాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని తొలిసారిగా హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో ప్రవేశపెట్టారు. ఇకపై సూదితో పొడిచే పని లేకుండానే కేవలం ముఖాన్ని స్కాన చేయడం ద్వారా రక్త పరీక్షలు చేయవచ్చు. ఏఐ ని బేస్ చేసుకొని రూపొందించిన ఈ టెక్నాలజీని అమృత్ స్వస్థ భారత్ కార్యక్రమంలో భాగంగా ఫిట్ విటల్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ విధానం చిన్న పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు తెలిపారు. మొదటి దశలో భాగంగా రెండు నెలల పాటు సుమారు వెయ్యి మంది పిల్లలకు ఈ పరికరంతో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వాత వారి నుంచి సేకరించిన రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని నీలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోను ఈ అత్యాధునిక విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వానికి సూచిస్తామని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
వచ్చిందమ్మ మాలక్ష్మి.. ఆడపిల్ల పుట్టిందని సంబరాలు వీడియో
అక్కడ అగరొత్తులు కాదు సిగరెట్లు వెలిగిస్తారు .. ఎందుకంటే వీడియో
సినిమాలోని దెయ్యం థియేటర్లోకి వచ్చిందా వీడియో
ఫస్ట్ నైట్ తర్వాత రోజే విడిపోయిన దంపతులు.. భర్త చేసిన పనికి నవ వధువు షాక్ వీడియో
