ఏకంగా ఆ పసివాడి ఉసురు కూడా తీసుకున్నాడు. తొమ్మిదేళ్ల కొడుకు వెంకటేశు ఆచూకీపై ఆందోళనతో తల్లి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది. సత్యవేడుకు చెందిన బాతుల వ్యాపారి ముత్తు వద్ద పనిచేస్తూ అప్పుగా తీసుకున్న డబ్బు తీర్చలేకపోయింది. దీంతో కొడుకును బాతులు మేపేందుకు వ్యాపారి ముత్తు వద్ద తొమ్మిది నెలల క్రితం పనిలో పెట్టింది. బాతులు మేపే పనిలో ఉన్న కొడుకును తిరిగి తీసుకు వెళ్లేందుకు అప్పుగా తీసుకున్న 40,000 సమకూర్చుకునే ప్రయత్నం చేసిన తల్లి అంకమ్మ గత నెలలో అప్పు తీర్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బాతుల వ్యాపారి ముత్తుకు ఫోన్ చేసి అప్పు కడతానని చెప్పింది. కొడుకును అప్పగించాలని కోరింది. సమయం కావాలన్న ముత్తు దాటవేసే ప్రయత్నం చేశారు.
