శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్రావు ఉగ్రవాదుల దాడిలో మృతి చెందారు. అతని వయసు 42 ఏళ్లు. ఇంజనీరింగ్ చదువుకున్న ఆయన బెంగళూరులోని ఐబీఎం కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. వేసవి సెలవులకు భార్య, పిల్లలతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్రావు మృతిచెందారు. తమ కుమారుడు చనిపోయాడన్న విషయం తెలియక ఆయన తల్లిదండ్రులు బుధవారం కూడా అరటిపండ్ల వ్యాపారం చేసుకుంటూ కనిపించారు. ప్రతిరోజూ ఫోన్ చేసి మాట్లాడే కుమారుడు మంగళవారం ఫోన్ చేయకపోవడంతో ఏం జరిగిందో అని కుమారుడ్ని తలుచుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఈ తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా ఉంది. కుమారుడి మరణ వార్త ఆ కన్నవారికి తెలియదు. చెబితే ఆ వృద్ధుల గుండెలు పగిలిపోతాయని బంధువులు ఎవరూ సాహసించలేదు. ఈ క్రమంలో భారత సైనికులు తీసుకువచ్చిన కుమారుడి మృతదేహాన్ని చూసి హతాశులయ్యారు. భార్యబిడ్డలతో సంతోషంగా వస్తాడనుకకున్న కుమారుడు శవమై ఇంటికి రావడంతో వారి రోదనలు మిన్నంటాయి. మధుసూదన్రావుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు ఇంటర్ చదువుతుండగా..మరొకరు 8వ తగరతి చదువుతున్నారు. మధుసూదన్ మృతదేహానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి నాదేండ్ల మనోహర్ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం :
ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో
జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్లో దారుణం.. వీడియో
ఆడ స్పైడర్ను ఆకర్షించేందుకు డ్యాన్స్..పడిపోయిందా ఒకే..! లేదంటే వీడియో
