
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్లో ఇప్పటికే మూడు మ్యాచ్లు ముగియగా టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ సిరీస్ కైవసం చేసుకుంటుంది. అదే ఇంగ్లండ్ గెలిస్తే ఐదో మ్యాచ్కు మరింతప్రాధాన్యత పెరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. చివరి మూడు మ్యాచ్ల్లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేసింది. ఇప్పుడు బట్లర్ కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు. మరోవైపు టీమిండియాలో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. అర్ష్దీప్ సింగ్, శివమ్ దూబే, రింకూ సింగ్లకు జట్టులో చోటు దక్కింది. షమీ స్థానంలో అర్ష్దీప్, జురెల్ ప్లేస్ లో రింకూ, వాషింగ్టన్ సుందర్ స్థానంలో శివమ్ దూబే జట్టులోకి వచ్చారని కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తెలిపాడు.
రింకూ సింగ్ వచ్చేశాడు..
ఇవి కూడా చదవండి
🚨 Team News
3⃣ changes for #TeamIndia as Rinku Singh, Shivam Dube & Arshdeep Singh are named in the Playing XI.
Here’s our line-up for the fourth T20I 🔽
Follow The Match ▶️ https://t.co/pUkyQwxOA3#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/SiIomnPrCR
— BCCI (@BCCI) January 31, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..