
Los Angeles 2028 Olympics: లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ క్రీడలలో క్రికెట్ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్ల వేదికలు కూడా ప్రకటించారు. 128 సంవత్సరాల తర్వాత క్రికెట్ ఒలింపిక్స్లో తిరిగి వస్తోంది. దీని కింద, పురుషులు, మహిళల విభాగాలలో ఆరు జట్లు ఒక్కొక్కటిగా పాల్గొని బంగారు పతకం కోసం పోటీపడనున్నాయి. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ నిర్వాహకులు ఏప్రిల్ 15న దక్షిణ కాలిఫోర్నియాలోని పోమోనాలోని ఫెయిర్గ్రౌండ్స్లో క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయని తెలిపారు. క్రికెట్ మ్యాచ్ల కోసం ఇక్కడ తాత్కాలిక స్టేడియం నిర్మించారు. ఒలింపిక్స్ తర్వాత ఈ స్టేడియం తొలగిస్తారు.
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్కు క్రికెట్ వేదిక ప్రకటనపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా స్పందించింది. ఈ క్రీడల్లో క్రికెట్ విజయం కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో కలిసి పనిచేస్తానని ఐసీసీ చైర్మన్ జై షా అన్నారు. ‘2028లో లాస్ ఏంజిల్స్లో క్రికెట్ వేదిక ప్రకటనను మేం స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇది ఒలింపిక్స్లో మన క్రీడను తిరిగి చేర్చే దిశగా ఒక ముఖ్యమైన అడుగు’ అని షా అన్నారు. క్రికెట్ చాలా ప్రజాదరణ పొందిన క్రీడ అయినప్పటికీ, ఒలింపిక్స్లో టీ20 ఫార్మాట్లో ఆడించనున్నారు. సాంప్రదాయ సరిహద్దులను దాటి వెళ్ళడానికి ఇది ఒక గొప్ప అవకాశం అవుతుంది. ఇది కొత్త వీక్షకులను తీసుకువస్తుంది.
1900 పారిస్ ఒలింపిక్స్లో క్రికెట్..
1900లో జరిగిన పారిస్ క్రీడలలో క్రికెట్ చివరిసారిగా ఒలింపిక్స్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. 2023 అక్టోబర్లో ముంబైలో జరిగిన IOC సమావేశం ద్వారా ఈ క్రీడ ఒలింపిక్స్లోకి తిరిగి వచ్చింది. క్రికెట్తో పాటు, బేస్ బాల్/సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, స్క్వాష్, లాక్రోస్ కూడా 2028 ఒలింపిక్స్లో చేర్చింది.
ఒలింపిక్స్కు ఆరు జట్లను ఎలా ఎంపిక చేస్తారనేది ఇంకా నిర్ణయించలేదు. కానీ, ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్-5 జట్లు నేరుగా ప్రవేశించవచ్చని, ఒక జట్టు ఆతిథ్య అమెరికా నుంచి వచ్చే అవకాశం ఉందని అర్థం చేసుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా, క్రికెట్ బహుళ క్రీడా ఈవెంట్లలో కనిపించింది. ఒలింపిక్స్కు ముందు, ఆసియా క్రీడలలో, ఇటీవల కామన్వెల్త్ క్రీడలలో క్రికెట్ మ్యాచ్లు జరిగిన సంతగి తెలిసిందే.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..