
ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో ఒక కీలక వార్త బయటకు వచ్చింది. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కార్బిన్ బాష్పై పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో పాల్గొనకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఒక సంవత్సరం పాటు నిషేధం విధించింది. కార్బిన్ బాష్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ (MI)తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్లో పాల్గొనడానికి కార్బిన్ బాష్ తన పేరును పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి ఉపసంహరించుకున్నాడు. ఆ తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కార్బిన్ బాష్ పై చర్య తీసుకుంది. ఈ క్రమంలో అతనిపై 1 సంవత్సరం నిషేధం విధించింది.
ముంబై ఇండియన్స్ ఆటగాడిపై పీసీబీ నిషేధం..
ఈ ఏడాది జనవరిలో జరిగిన పీఎస్ఎల్ డ్రాఫ్ట్లో 30 ఏళ్ల కార్బిన్ బాష్ను పెషావర్ జల్మి డైమండ్ విభాగంలో ఎంపిక చేసింది. అయితే, ఐపీఎల్ 2025లో గాయపడిన లిజాద్ విలియమ్స్ స్థానంలో ముంబై ఇండియన్స్ అతన్ని ఎంపిక చేసింది. దీని కారణంగా అతను టోర్నమెంట్ ప్రారంభానికి కొన్ని వారాల ముందు PSL నుంచి నిష్క్రమించాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కోపంగా ఉంది. కార్బిన్ బాష్పై ఒక సంవత్సరం పాటు నిషేధం విధించింది.
క్షమాపణలు చెప్పిన కార్బిన్ బాష్..
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయంపై కార్బిన్ బాష్ స్పందిస్తూ, ‘పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) నుంచి వైదొలగాలనే నిర్ణయానికి నేను తీవ్రంగా చింతిస్తున్నాను. పాకిస్తాన్ ప్రజలకు, పెషావర్ జల్మి అభిమానులకు, క్రికెట్ ఫ్యాన్స్కు నేను క్షమాపణలు చెబుతున్నాను. PSL ఒక ప్రతిష్టాత్మక టోర్నమెంట్. నా చర్యలు నిరాశను కలిగిస్తాయని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. పెషావర్ జల్మి అభిమానులను నిరాశపరిచినందుకు నాకు నిజంగా బాధగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి
పీఎస్ఎల్కు తిరిగి వస్తాను..
‘నా చర్యలకు నేను పూర్తి బాధ్యత వహిస్తాను. పరిణామాలను అంగీకరిస్తున్నాను. ఇందులో జరిమానాతోపాటు, పీఎస్ఎల్ నుంచి ఒక సంవత్సరం నిషేధం ఉన్నాయి’ అంటూ కార్బిన్ బాష్ తెలిపాడు. ‘ఇది కఠినమైన పాఠం. కానీ, ఈ అనుభవం నాకు ఎన్నో విషయాలను నేర్పించింది. భవిష్యత్తులో కొత్త అంకితభావంతోపాటు అభిమానుల కోసం PSLకి తిరిగి రావాలని ఆశిస్తున్నాను’ అంటూ ముగించాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ చేయండి..