గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం డెంగీ, మలేరియా కంటే విష జ్వరాలు వేధిస్తున్నాయి. జిల్లాలో వివిధ ఆసుపత్రులు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. ప్రభుత్వ వైద్య సిబ్బంది సకాలంలో స్పందించడం లేదని, అన్నింటికీ ఒక్కటే మందు ఇస్తున్నారని ఇస్తున్నారని రోగులు వాపోతున్నారు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఒక్కొక్కరు 20 నుంచి 30 వేల రూపాయలు ఖర్చుపెట్టి అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.అనేక చోట్ల కలుషిత నీరు కారణంగా విష జ్వరాలు చుట్టుముడుతున్నాయని బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా డ్రైనేజీ , మంచినీటి పైప్ లైన్ లకు మరమ్మత్తులు చేసి జ్వరాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
అదీ మనవడా, అట్లా చేయాలి..మనవడిని చూసి మురిసిపోయిన కేసీఆర్ వీడియో!
నుమాయిష్ ఎగ్జిబిషన్ రైడ్లో తలకిందులుగా.. తర్వాత ఏమైందంటే..
భారత్లో రియల్ ఎస్టేట్ దూకుడు..53% పెరిగిన విక్రయాలు!
