
ఈ పరిస్థితిలో నిమ్మ నీరు తాగితే, సిట్రిక్ యాసిడ్ కూడా దానితో పాటు శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల కడుపులో ఆమ్లం పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా, అసిడిటీతో బాధపడే ప్రమాదం ఉంది. అందుకే ఖాళీ కడుపుతో నిమ్మ నీరు తాగడం వల్ల కొంతమందికి గుండెల్లో మంట వస్తుంది. ఫలితంగా పుల్లని త్రేనుపు, కడుపులో అసౌకర్య భావన తలెత్తి, అపానవాయువు వంటి లక్షణాలు సంభవిస్తాయి. దాని వల్ల కడుపు నొప్పి కూడా వస్తుంది.