

కాలింగ్, ఎస్సెమ్మెస్ ప్రయోజనాలను మాత్రమే అందించే ఈ ప్లాన్లు ఇప్పుడు రెండు కంపెనీల వెబ్సైట్లో యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లను తీసుకురావాలని ట్రాయ్ 2024 డిసెంబర్ 23న అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. డేటా అవసరం లేని వారికి ఇలాంటి ప్లాన్లు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొంది. ఫీచర్ ఫోన్ వినియోగదారులతో పాటు రెండు సిమ్లను ఉపయోగించే వారికి కూడా ఇది ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపింది. ట్రాయ్ ఆదేశాలను అనుసరించి జియో వాయిస్ ఓన్లీ పేరిట రెండు రీఛార్జ్ ప్లాన్లను తీసుకువచ్చింది. రూ. 458, రూ. 1,958 ప్లాన్ను ప్రారంభించింది. రూ.458 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. దీనిలో దేశీయంగా ఉచిత అపరిమిత కాలింగ్తో పాటు 1,000 ఉచిత ఎస్సెమ్మెస్లను పొందవచ్చు. అలాగే జియో సినిమా, జియో టీవీ యాప్లకు యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. ఇందులో మొబైల్ డేటా ఉండదు.