
హృతిక్ రోషన్ ‘క్రిష్’ భారతీయ సినిమాలో మొట్టమొదటి మరియు అత్యంత విజయవంతమైన సూపర్ హీరో చిత్రం. శక్తిమాన్ పాత్ర మొదట భారతదేశపు మొట్టమొదటి సూపర్ హీరో అయినప్పటికీ, అది కేవలం టీవీకే పరిమితం. ‘కోయి మిల్ గయా’ చిత్రానికి సీక్వెల్గా ‘క్రిష్’ సినిమా వచ్చి భారీ విజయాన్ని సాధించింది. ఇప్పటివరకు ఈ సిరీస్ లో మూడు సినిమాలు విడుదలయ్యాయి. మూడూ బ్లాక్ బస్టర్స్ హిట్ అయయాయి. దీంతో ఈ సిరీస్ లో నాలుగో పార్ట్ ఎప్పుడొస్తుందా? అని అిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత రెండేళ్లుగా ‘క్రిష్ 4’ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ క్రేజీ సీక్వెల్ ప్రారంభం కాలేదు. ‘క్రిష్ 4’ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటోంది. కాగా గతంలో వచ్చిన క్రిష్ సినిమాలు 100 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినవే. ఇక ‘క్రిష్ 3’ విడుదలై 12 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నిర్మాణ వ్యయం బాగా పెరిగింది. అలాగే, ఈ పదేళ్లలో, మార్వెల్, డీసీ వంటి సంస్థలు తమ VFX ని అందనంత ఎత్తునకు తీసుకెళ్లాయి. కాబట్టి ఇప్పుడు, ‘క్రిష్ 4’ సినిమా తీస్తే, ప్రజలు దానిని మార్వెల్ సూపర్ హీరో సినిమాలతో పోలుస్తారు. కాబట్టి ‘క్రిష్ 4’ ని భారీ స్థాయిలో నిర్మించాలి.
ప్రస్తుతమున్న పరిస్థితులన బట్టి చూస్తే క్రిష్4 సినిమా బడ్జెట్ దాదాపు 700 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేస్తున్నారు
అయితే నిర్మాణ సంస్థలు అంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టేందుకు వెనుకాడుతున్నాయి. అలాగే, మునుపటి ‘క్రిష్’ చిత్రాలను హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించి నిర్మించారు. కానీ హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ సినిమా బాధ్యతను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్కు అప్పగించినట్లు సమాచారం. అయితేతాజా సమాచారం ప్రకారం.. బడ్జెట్ విషయంలో సిద్ధార్థ్ ఆనంద్ ఆలోచనలో పడ్డారని, దాంతో ఆయన నిర్మాణ బాధ్యతల నుంచి వైదొలగారని బీటౌన్లో ప్రచారం జరుగుతోంది.
ఇక సిద్ధార్థ్ ఆనంద్ ప్రస్తుతం ‘వార్ 2’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత, అతను షారుఖ్ ఖాన్ కోసం ఒక కొత్త చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. ఈ సినిమాల తర్వాతే ఆయన ‘క్రిష్ 4’ సినిమాపై దృష్టి పెడతారు. కాబట్టి ‘క్రిష్ 4’ కనీసం రెండు సంవత్సరాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి