
ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.82,300 ఉండగా, అదే 24 క్యారెట్ల ధర రూ.89,780 వద్ద కొనసాగుతోంది. అంటే రూ.90 వేల చేరువలో ఉంది. రానున్న రోజుట్లో లక్ష రూపాయలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వెండి ధర కిలోపై ఏకంగా రూ.2000 వరకు పెరిగింది. ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర రూ.1,03,000 ఉండగా, చెన్నై, హైదరాబాద్, కేరళ రాష్ట్రాల్లో రూ.1,12,000 వరకు ఉంది.