
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలకమైన శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా శాసనసభ, హైకోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) చర్యలు చేపట్టింది.
టెండర్ల ప్రక్రియ – కీలక సమయాలు
CRDA అసెంబ్లీ భవనం నిర్మాణానికి 768 కోట్ల రూపాయలు, హైకోర్టు భవనం నిర్మాణానికి 1,048 కోట్ల రూపాయలు అంచనా వేసి బిడ్లు ఆహ్వానించింది. టెండర్ల దాఖలు గడువును ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు పెట్టింది. అలాగే సాంకేతిక బిడ్ సమర్పణకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు గడువు పెట్టింది. ఇక ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలనకు సాంకేతిక అర్హతలు పరిశీలించిన అనంతరం ఏజెన్సీల ఎంపిక ఉంటుందని చెప్పింది.
అసెంబ్లీ భవన నిర్మాణం – ప్రణాళికలు
విస్తీర్ణం: 103.76 ఎకరాల్లో 11.21 లక్షల స్క్వేర్ ఫీట్.
ఇవి కూడా చదవండి
నిర్మాణ విధానం: బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 3 అంతస్తులు.
డిజైన్: లండన్కు చెందిన ప్రముఖ సంస్థ నార్మన్ పోస్టర్స్.
ఆకృతి: పైభాగం శిఖరాకారంలో ఉండేలా, నగరాన్ని చూడగలిగేలా ప్రత్యేక ప్రణాళిక.
నిర్మాణ వ్యయం:
2018లో అంచనా: 555 కోట్లు
ప్రస్తుత అంచనా: 768 కోట్లు
విభిన్న ఆకృతిలో అసెంబ్లీ భవనం..
మొదటి అంతస్తు:
మంత్రుల ఛాంబర్లు
అసెంబ్లీ హాల్, కౌన్సిల్ హాల్
క్యాంటీన్లు, లైబ్రరీ, సెంట్రల్ హాల్
రెండో అంతస్తు:
అసెంబ్లీ, కౌన్సిల్ హాళ్లు
కమిటీ ఛాంబర్లు, సభ్యుల లాంజ్
శిక్షణ కేంద్రం
శాశ్వత హైకోర్టు భవనం – నిర్మాణ ప్రణాళికలు
విస్తీర్ణం: 42.36 ఎకరాల్లో 20.32 లక్షల స్క్వేర్ ఫీట్.
నిర్మాణ శైలి: బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 7 అంతస్తులు.
డిజైన్ మార్పులు:
గత అంచనా వ్యయం: 860 కోట్లు
ప్రస్తుత అంచనా వ్యయం: 1,048 కోట్లు
ఎత్తైన భవనం – ముఖ్యమైన విభాగాలు
ఏడో అంతస్తు:
పూర్తి స్థాయి కోర్టు సమావేశ మందిరం
డైనింగ్ హాల్
సువిశాల గ్రంథాలయం
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి