

అమెరికా పర్యటనలో చేదు అనుభవంతో వెనుదిరిగిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ లండన్ చేరుకున్నారు. లండన్లో ఈయూ సమ్మిట్కు జెలెన్స్కీ హాజరవుతారు. ట్రంప్తో వైట్హౌజ్లో గొడవ కారణంగా కీలకమైన ఖనిజ ఒప్పందంపై సంతకాలు చేయకుండానే వెళ్లిపోయారు జెలెన్స్కీ. అయితే లండన్ చేరుకున్న తరువాత కాస్త మెత్తబడ్డారు జెలెన్స్కీ. అమెరికా తమకు ఎప్పటికి మిత్రదేశమే అన్నారు. పుతిన్ నుంచి రక్షణ కల్పిస్తే ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్దమన్నారు. పుతిన్ విషయంలో అమెరికా గ్యారంటీ ఇస్తే వెంటనే సంతకం చేస్తామన్నారు.
అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య.. వాషింగ్టన్ డీసీలోని వైట్హౌజ్లో జరిగిన భేటీ వాగ్వాదానికి దారి తీసింది. కీలకమైన ఖనిజ ఒప్పందంపై సంతకం చేయకుండానే.. వైట్హౌస్ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.
ఓవల్ ఆఫీసులో ఆ ఇద్దరు నేతలు మీడియా ముందే చిర్రుబురులాడుకున్నారు. రూమ్ అంతా నిండిన మీడియా ముందే ఆ ఇద్దరు నేతలు మాటల యుద్ధం కొనసాగింది. ఉక్రెయిన్- రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో జెలెస్కీ వ్యవహార శైలి సరికాదని.. జెలెన్ స్కీని “స్టుపిడ్ ప్రెసిడెంట్”అంటూ మండిపడ్డారు. ట్రంప్, జెలెన్స్కీ వాగ్వాదంతో ఖనిజాల తవ్వకం ఒప్పందం నిలిచిపోయింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..