అలిపిరి మెట్ల మార్గంలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దిగువ ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో .. నడకదారి ద్వారా తిరుమల చేరుకునే భక్తుల సౌకర్యార్థం ఏడో మైలు వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ఇప్పటికే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేసామని, భక్తుల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు టీటీడీ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కనిగిరికి రైలు.. సాకారమైన 30 ఏళ్ళ కల
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
చలి గుప్పిట్లో తెలంగాణ.. నెల రోజులుగా వణుకే..
ATM: ఇక.. ఏటీఎంలు కనుమరుగేనా
ధోనీ కారులో అది చూసి నెటిజన్లు షాక్.. వీడియో వైరల్
