ఏలూరు జిల్లా పెరవలి మండలం ఖండవల్లి గ్రామస్తులు దీపావళిని ప్రత్యేకంగా జరుపుతారు. గ్రామ జనాభా 5 వేల మంది వరకు ఉంటారు. దీపావళి పండుగ సందర్భంగా ఊరులోని రైతులంతా కలిసి తమ తోటల్లోని అరటి చెట్లను తీసుకొచ్చి వీధుల్లో నాటుతారు. దాంతో గ్రామమంతా అరటితోటను తలపిస్తుంది. ఈ గ్రామంలో సంఘాలవారీగా 18 రామాలయాలు ఉన్నాయి. రైతులు తాము పండించిన అరటి గెలలను చెట్లతో సహా తీసుకొచ్చి రామాలయాలను సుందరంగా అలంకరించటం ఇక్కడి ప్రత్యేకత. దీపావళివేళ ఈ చెట్లపై మట్టిప్రమిదలను ఉంచి దీపాలు వెలిగిస్తారు. గ్రామంలోని 18 రామాలయాల వద్ద ఉంచిన అరటి గెలలను దీపావళి పండుగ మరుసటి రోజున తీసుకొచ్చి వేలంలో విక్రయిస్తారు. ఈ అరటిగెలలను దక్కించుకునేందుకు ఖండవల్లి గ్రామస్తులతో పాటు ఇతర ప్రాంతాల వాళ్ళు పోటీ పడతారు. ఇలా ఆలయాలకు అలంకరించిన అరటి గెలలను రాముని ప్రసాదంగా భావిస్తారు. పండగవేళ వాటిని దక్కించుకుంటే ఆ ఏడాదంతా వారికి మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ ఆచారం తరతరాలుగా తమ గ్రామంలో కొనసాగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బొద్దింకను చంపబోయి.. అపార్ట్మెంట్కే నిప్పటించింది
సముద్ర తీరంలో భారీ కళేబరం.. దగ్గరికెళ్లి చూస్తే
వాట్సాప్ కీలక అప్డేట్… ఇకపై చాట్ జీపీటీ పని చేయదు
రాబోయేది మినరల్ వార్.. రంగంలోకి భారత్.. చైనాకు చెక్
గత అమావాస్యకు క్షుద్రపూజలు.. ఈ అమావాస్యకు షాపు దగ్ధం
