
కాగా, సైఫ్ తను డిశ్చార్జ్ అయ్యే ముందు ఆటో డ్రైవర్ను ఆసుపత్రిలో కలిశారు. రానాను కౌగిలించుకుని ధన్యవాదాలు తెలిపాడు. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ కూడా రానాను ఆశీర్వదించారు. అలాగే అతనికి సైఫ్ రూ.50వేలు ఇచ్చినట్లు సమాచారం. ఇక జనవరి 16న తన బాంద్రాలోని సద్గురు శరణ్ ఇంటిలో చోరీకి ప్రయత్నించిన సమయంలో సైఫ్ అలీఖాన్ను ఒక ఆగంతుకుడు ఆరుసార్లు కత్తితో పొడిచిన విషయం తెలిసిందే. దాడి తర్వాత ఆయన తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఆటోలో లీలావతి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు సైఫ్కు సర్జరీ చేశారు. ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన డిశ్చార్జ్ అయ్యారు. కాగా, పోలీసులు జనవరి 19న ముంబయిలోని థానేలో ఈ దాడికి పాల్పడిన బంగ్లాదేశ్ వాసి మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ని అరెస్టు చేశారు. త్వరలోనే నిందితుడుని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది.