
హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ప్రస్తుతం ఈ బ్యూటీ వరస సినిమాలతో ఫుల్ జోష్లో ఉంది.
రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగింది. దీంతో వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ చిన్నది తాజాగా తన సోషల్ మీడియాలో శ్రీలంకలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది.
శ్రీలంకలో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ.. బెడ్ పై మామిడిపండ్ల ముక్కలను పెట్టుకొని, వాటిని వయ్యారంగా తింటూ ఫొటోలకు ఫోజులిచ్చింది.
ఈ ఫొటోలను ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. శ్రీలంక వైబ్ కు మ్యాచ్ అయ్యేలా కాస్త స్వీట్ నెస్.. ఎవరైనా మామిడిని ప్రేమించే వారున్నారా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.