ఈ సంవత్సరం మహానవమిని అక్టోబర్ 1, 2025న జరుపుకోనున్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న అమ్మవారి భక్తులు మండపాల్లో, అమ్మవారి దేవాలయాలలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం, జ్యోతిషశాస్త్ర దృక్పథంలో మహానవమి విశేషమైన రోజు. మహా నవమి రుదైన గ్రహ సంయోగం ఏర్పడనుంది. నవ గ్రహాల రాజు అయిన సూర్యుడు, గ్రహాల యువరాజు బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని సృష్టిస్తున్నారు.
