
తాజాగా పవన్ కూతురు ఆద్య చేసిన ఒక మంచి పని అందరి మన్ననలు అందుకుంటోంది. ఇక రేణూ దేశాయ్ అయితే కూతురి గొప్ప తనాన్ని చూసి తెగ మురిసిపోయింది. తన సోషల్ మీడియాలో ఆమె ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తాజాగా ఆద్య తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. సాధారణంగా సెలబ్రిటీల పిల్లలంటే పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా ఉంటాయి. కేక్ కటింగ్, పార్టీలు, విందులు, వినోదాలు, ఫ్రెండ్స్.. ఇలా తమకు నచ్చిన రీతిలో పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఆద్య మాత్రం సింపుల్ గా తన పుట్టిన రోజును జరుపుకొంది. దీనికి సంబంధించి రేణూ దేశాయ్ కు ముందే చెప్పిందట. బర్త్ డే కదా అని హడావిడి, హంగామా ఏమీ వద్దని, చాలా సింపుల్గా బర్త్ డేను సెలెబ్రేట్ చేయమని రేణూను కోరిందట ఆద్య. వాటికి ఖర్చు పెట్టే డబ్బుల్ని ఎన్జీవోకి వాడమని చెప్పిందట. తద్వారా ఎన్నో మూగ జీవాలకు ఆ డబ్బులు ఉపయోగపడతాయని సలహా ఇచ్చిందట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పచ్చి ఉల్లి తినే అలవాటు ఉందా ?? ఇది మీకోసమే !!
గ్రహాంతరవాసులు ఉన్నారా ?? ఏలియన్స్ జాడ అమెరికాకు తెలుసా ??
ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..
పనస తొనలు ఆరోగ్యమే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం
రష్మికతోనే కాదు.. ఆమెకు పుట్టబోయే కూతురితో కూడా నటిస్తా..